ఈతరం భారతం జనవరి 26 యాదాద్రి భువనగిరి :
జిల్లా పరిధిలోని ఆలేరు నియోజకవర్గ కేంద్రంలో ఉన్న పోచమ్మతల్లి దేవాలయం వద్ద శ్రీ భగత్ యూత్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. కీర్తిశేషులు బొట్ల మల్లికార్జున్ కుమారుడు అసిస్టెంట్ ప్రొఫెసర్,జనరల్ సర్జన్ డాక్టర్ బొట్ల చాణక్య జెండా ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ తిరునగరి శ్రీనివాస్, భగత్ సింగ్ యూత్ సభ్యులు బొట్ల విశ్వేశ్వర్, సబ్బన్ సుభాష్, బండ శ్రీనివాస్, పాశికంటి శ్రీనివాస్, శీలా వెంకటేష్, దయ్యాల సిద్దులు, తునికి రామారావు, చిప్ప ప్రభాకర్, మామిడాల రాజు పాల్గొన్నారు.















