ఈతరం భారతం ఆలేరు ఆగస్టు 28 :యాదాద్రి భువనగిరి: జిల్లా పరిధిలోని ఆలేరు నియోజకవర్గంలో ప్రధానమైన చెరువులు కుంటలు వర్షాల వల్ల నిండిపోయి జలకళ సంతరించుకోవడం హర్షణీయమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గురువారం మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. భూగర్భ జలాలు సమృద్ధిగా ఉండేందుకు ఇప్పుడు కురిసిన వర్షాలు తోడ్పడతాయని తెలిపారు. టిపిసిసి ప్రధాన కార్యదర్శి జనగాం ఉపేందర్ రెడ్డి, ఆలేరు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఎం ఏ ఎజాస్, నాయకులు దూడల రాజశేఖర్ గౌడ్ తో పాటు పలువురు ముఖ్యులు పాల్గొన్నారు.















