EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

సదాశివపేట పట్టణం లోని హజరత్ మహబూబ్ పాశ దర్గా ఉర్సు ఉత్సవాల్లో పాల్గొన్న జగ్గారెడ్డి

ఈతరం భారతం సదాశివపేట ఏప్రిల్ 18

సదాశివపేట పట్టణం లోని హజరత్ మహబూబ్ పాశ దర్గా లో జరిగిన ఉర్సు ఉత్సవాల్లో టీపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పాల్గొన్నారు. గత మూడు రోజులు గా ఉర్సు ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ దర్గా లో హజరత్ సయ్యద్ షా మహమ్మద్ సాహబ్ 422 వ ఉర్సే షరీఫ్ మరియు హజరత్ మహబూబ్ పాశ 52 వ ఉర్సే షరీఫ్ ఉత్సవాలు సంయుక్తంగా జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా జరిగిన కవ్వాలి కార్యక్రమం ఆహుతులను అలరించింది. కవ్వాలి కార్యక్రమం నిర్వాహకులను, దర్గా కమిటీ సభ్యులను జగ్గారెడ్డి అభినందించారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ ఉర్సు ఉత్సవాలు మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్నాయని, కవ్వాలి కార్యక్రమం బాగుందని నిర్వాహకులను అభినందించారు.

Related News

Select the Topic
Scroll to Top