ఈతరం భారతం జనగామ జూన్ 4
తెలంగాణలో ఉపాధి హామీ కూలీలను ‘గుండు’ గండం వేధిస్తోంది. మొక్కుబడులు లేదా ఇతర కారణాలతో గుండు చేయించుకున్న వారి ముఖాలను NMMS యాప్లోని ఫేస్ ఐడెంటిఫికేషన్ గుర్తించలేకపోతోంది. ఫలితంగా వారికి హాజరు పడటం లేదు. తాజాగా జనగామ జిల్లా కృష్ణాజిగూడెంలో ఓ కూలీ భార్య జడను తన తలపై వేసుకుని ఫొటో దిగగా అటెండెన్స్ పడటం గమనార్హం. ఈ సాంకేతిక సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కూలీలు కోరుతున్నారు.














