ఈతరం భారతం హైద్రాబాద్ జులై 14:
గాంధీభవన్లో తెలంగాణ రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ వైస్ చైర్మన్ బోయ నగేష్ ఆధ్వర్యంలో కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ , దిష్టిబొమ్మ ను దహనం చేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి గారిని మరియు కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీపై అనుచిత వ్యాఖ్యలు చేయడాని ఖండిస్తూ,మల్లయ్య యాదవ్ గారి. దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగిందని తెలంగాణ రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ వైస్ చైర్మన్ బోయ నగేష్ తేలిపారు .ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ధైర్యం ఉంటే చర్చకు రావాలని సవాల్ విసిరారు. బి ఆర్ ఎస్ నాయకులు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడితే ఊరుకునేది లేదని వారిని హెచ్చరించారు.















