ఈతరం భారతం జనగామ ఆగస్ట్ 12;
కస్టమ్ మిల్లింగ్ (లెవీ)లో అక్రమాలకు పాల్పడే వారిని ఉపేక్షించే ప్రసక్తే లేదని,చట్ట పరంగా తగు చర్యలకు సిఫారసు చేస్తామని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తాశిల్దార్ మాచన రఘునందన్ స్పష్టం చేశారు.బుధవారం నాడు ఆయన జనగామ జిల్లా లింగాల ఘనపురం లో మణికంఠ ఆగ్రో ఇండస్ట్రీస్ ను స్థానిక తాసిల్దార్ తో కలిసి తనిఖీ చేశారు.మిల్లు లో ఎంత ధాన్యం మిగిలి ఉంది అనే విషయం లో లోతుగా విచారణ జరిపారు. తదనంతరం సంయుక్త పంచానామా నిర్వహించారు.
ఈ సందర్భంగా రఘునందన్ మాట్లాడుతూ..లెవీ లో.. అక్రమాలు జరిగితే అరెస్టులు తధ్యం అని రఘునందన్ స్పష్టం చేశారు.















