ఈతరం భారతం హైదరాబాద్ ఆగస్ట్ 13
తెలంగాణలో పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ ప్రక్రియకు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 36,353 పోలింగ్ కేంద్రాలను అధికారికంగా ఖరారు చేశారు. ఓటర్ల సంఖ్యను సమతుల్యం చేయడం, పోలింగ్ కేంద్రాల వద్ద రద్దీని తగ్గించడం, ప్రజలకు సమీపంలోనే ఓటు వేసే అవకాశం కల్పించడం లక్ష్యంగా ఈ పునర్వ్యవస్థీకరణ చేపట్టారు. ఈ ప్రక్రియలో కొత్తగా 368 పోలింగ్ కేంద్రాలు పెరిగాయి. హైదరాబాద్ జిల్లాలో అత్యధికంగా 4,094 కేంద్రాలు, ములుగు జిల్లాలో అత్యల్పంగా 308 కేంద్రాలు ఏర్పాటు చేశారు. కొత్త కేంద్రాలకు అనుగుణంగా BLOల సర్దుబాటు, ఓటర్ల జాబితా నవీకరణను అధికారులు వేగవంతం చేస్తున్నారు.















