ఈతరం భారతం యాదాద్రి భువనగిరి జిల్లా: ఆగస్ట్ 15 శనివారం
జిల్లా పరిధిలోని ఆలేరు నియోజకవర్గ కేంద్రంలో ఉన్న పోచమ్మ వాడ పోచమ్మ తల్లి దేవాలయం ప్రాంగణంలో శ్రీ భగత్ సింగ్ యూత్ ఆధ్వర్యంలో శనివారం 80వ భారత స్వాతంత్ర దినోత్సవ పతాకావిష్కరణ ఉత్సవం ఎంతో ఘనంగా జరిగింది.శ్రీ భగత్ యూత్ సభ్యులు, సీనియర్ న్యాయవాది, మాజీ జడ్పీటీసీ బొట్ల పరమేశ్వర్ పతాకావిష్కరణ జరిపారు . ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు, కవి డాక్టర్ తిరునగరి శ్రీనివాస్ , జర్నలిస్టులు కొరుటూరు ఉపేందర్, కూళ్ళ సిద్ధులు, శ్రీ భగత్ యూత్ సింగ్ సభ్యులు బొట్ల విశ్వేశ్వర్, సబ్బన్ సుభాష్, బండ శ్రీనివాస్, పాశికంటి శ్రీనివాస్, దయ్యాల సిద్దులు, చిప్ప ప్రభాకర్, కుడికాల భాను, కుడికాల రాకేష్, సబ్బన్ సునీల్, దాసి నరసింహులు, ఆడేపు భరత్ పాల్గొన్నారు.















