ఈతరం భారతం ఢిల్లీ, సెప్టెంబర్ 4: శుక్రవారం
____________________________________
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) మరో ఘన విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి నిర్వహించిన జీఎస్ఎల్వీ-ఎఫ్17 (GSLV-F17) రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. ఈ రాకెట్, భారతదేశపు తొలి జియోసింక్రోనస్ ఇమేజింగ్ శాటిలైట్ అయిన EOS-05 (Earth Observation Satellite-05)ను నిర్దేశిత కక్ష్యలోకి అత్యంత కచ్చితత్వంతో ప్రవేశపెట్టిందిఈ చరిత్రాత్మక విజయంపై కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ హర్షం వ్యక్తం చేశారు. ఇది ‘భారతదేశానికి గర్వకారణం’ అని అభివర్ణించారు. ‘ఇస్రో జీఎస్ఎల్వీ-ఎఫ్17 తో EOS-05 ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించడం భారత్కు ఎంతో గర్వకారణమైన క్షణం. ఇది మన దేశ అంతరిక్ష సాంకేతిక సామర్థ్యాలను, అలాగే ఇస్రో, భారతీయ పరిశ్రమల మధ్య పెరుగుతున్న భాగస్వామ్యాన్ని స్పష్టం చేస్తోంది’ అని రణధీర్ జైస్వాల్ సామాజిక మాధ్యమం ‘X’ లో పేర్కొన్నారు















