EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

టిబి (క్షయ)ను జయిద్దాం – డాక్టర్ లిల్లీ మేరి

 నేడు ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవం

  క్షయ వ్యాధి నివారణకు సరైన సమయంలో మందులు వాడటం ఒకటే మార్గం. ప్రపంచవ్యాప్తంగా క్షయను నిర్మూలించాలంటూ ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. లక్షలాది తోడేయడమే కాదు,, అసంఖ్యాక కుటుంబాలు వెన్ను విరిచి, మనుగడను గుల్ల బార్చి ఎందరో బాల బాలికలని అనాధలుగా మారుస్తున్న క్షయ వ్యాధి పర్యవసాసనాల్ని ప్రభుత్వం ఒక్కటే నియంత్రించగల అవకాశం లేదు. ప్రజా వైద్య సేవారంగాన టిబి గుర్తింపు, చికిత్స కోసం సకల సదుపాయాలు ఉన్నాయంటున్నా ఎంతకీ ఆగని మానవ మహా విషాదం దేశవ్యాప్తంగా క్షయ వ్యతిరేక పోరు సత్వరమే, ఏకధాటిపైకి రావలసిన ఆవశ్యకత ఎంతో ఉంది. భారత్, చైనా, దక్షిణాఫ్రికా, నైజీరియా, జింబాబ్వే ఇథియోపియా సహా 30 దేశాలలో క్షయ వ్యాధి అధికంగా ఉంది.

టిబి (క్షయ) సమస్య – తీవ్రత

కేంద్ర గణాంకాల ప్రకారం భారత్ సహా 30 దేశాలలో వ్యాధి తీవ్రత అధికం గా ఉంది. ప్రపంచవ్యాప్త బాధితులలో 27 శాతం మంది భారతదేశము లోనే ఉన్నారు. వీరిలో అత్యధికులు నిరుపేదలే. దేశంలో ఏటా లక్షకు పైగా కొత్త కేసులు అధికారికంగా గుర్తింపునకు నోచుకోవటం లేదు.

టిబి (క్షయ) అంటే…?

టిబి (క్షయ) వ్యాధి మైకో బ్యాక్టీరియo ట్యూబర్ క్యూలోసిస్ అనే క్రిమి వలన వచ్చే అంటు వ్యాధి. క్షయ చాలా సులభముగా వ్యాపిస్తుంది. ఇది తీవ్రమైన అంటూ వ్యాధి. ఈ టిబి (క్షయ) క్రిములు ముఖ్యముగా ఊపిరితిత్తులకు సోకి శ్వాసకోస టిబి (క్షయ) వ్యాధిని (పల్మనరీ టిబి) కలిగిస్తాయి. ఇది శరీరంలోని ఇతర భాగాలకు కూడా సోకవచ్చు అని సిద్దిపేట ప్రభుత్వ నర్సింగ్ కళాశాల సహాయ ఆచార్యులు డాక్టర్ లిల్లీ మేరి పేర్కొన్నారు.

ఎ.లా వ్యాపిస్తుంది?

టిబి (క్షయ) క్రిములు గాలి ద్వారా వ్యాపిస్తాయి. మైకో బ్యాక్టీరియo ట్యూబర్ క్యూలోసిస్ క్రిమి టిబి జబ్బు ఉన్న వ్యక్తి దగ్గినప్పుడు అతని ఊపిరితిత్తులలో నుండి వచ్చే కఫము ద్వారా గాలిలోకి చేరి దగ్గరలో ఉన్న ఆరోగ్యవంతమైన మనిషి పీల్చితే గాలితో పాటు కలసి అతను ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించి జబ్బుకు పునాది వేస్తుంది. జబ్బు ఉన్న వ్యక్తి ఒక్కసారి దగ్గి కఫము ఊస్తే వేలాది క్రిములు వెలుపలకి వస్తాయి. టిబి జబ్బుతో బాధపడుతున్న వ్యక్తికి దగ్గుతో పాటు రోజు కఫం వస్తుంటే, ఎన్ని కోట్ల క్రిములు వెలుపలకు వస్తున్నాయో, అది ఎంతోమందికి హానికరం. ఒక రోగి కఫములో టిబి క్రిములు ఉంటే అతను సంవత్సరములో మరో 15 మందికి ఈ వ్యాధిని అంటించే అవకాశాలు ఉన్నాయి అని సిద్దిపేట ప్రభుత్వ నర్సింగ్ కళాశాల సహాయ ఆచార్యులు డాక్టర్ లిల్లీ మేరి తెలిపారు.

వ్యాధి లక్షణాలు

మూడు వారాలకు మించి కఫముతో కూడిన దగ్గు, సాయంత్రం పూట జ్వరం రావడం, ఆకలి తగ్గటం, చాతిలో నొప్పి, బరువు తగ్గటం, కఫములో రక్తం పడటం వంటి లక్షణాలు ఉన్న వ్యక్తులు వెంటనే అందుబాటులోని ప్రభుత్వ ఆసుపత్రిలో హెచ్ఐవి, క్షయ వ్యాధి పరీక్షలు చేయించుకోవాలి. ఈ లక్షణాలు కలిగి ఉన్న వారు ఇతరులకు దగ్గర ఉండి దగ్గకూడదు. దగ్గును ఇతరులకు శోకకుండా జాగ్రత్త పడాలి. మాస్కులను వాడాలని, డాక్టర్ ను సంప్రదించాలని సహాయ ఆచార్యులు డాక్టర్ లిల్లీ మేరి కోరారు.

టిబి (క్షయ)ని అరికట్టవచ్చు

సకాలంలో వైద్యం తీసుకోవడంతో పాటు కోర్సులు సక్రమంగా పాటిస్తేనే టిబి (క్షయ)వ్యాధిని అరికట్టవచ్చు అని, అందుకు ఐదు ప్రధాన అంశాలను రోగులకు వివరిస్తున్నారు. (1) రెండు వారాలకు మించి దగ్గు ఉన్నచో వెంటనే దగ్గరలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలను సంప్రదించాలి. (2) టిబి (క్షయ) వ్యాధి నిర్ధారణ అయితే ఆరు నుంచి 8 నెలలు క్రమం తప్పకుండా డాట్స్ మందులు వాడాలి. (3) ఆరోగ్య కార్యకర్తల పర్యవేక్షణ లో ఇచ్చే డాట్స్ మందులు మాత్రమే వాడాలి. (4) తేమడ పరీక్షలు సరైన సమయంలో చేయించుకోవాలి. (5) టిబి (క్షయ) నిర్ధారణ పరీక్షలు, చికిత్స పూర్తిగా ఉచితంగా ప్రభుత్వం వారు అందిస్తున్నారు అని లిల్లీ మేరి తెలిపారు.

టీనేజ్ యువతపై టిబి పంజా

టీనేజ్ యువత పై టిబి పంజా విసురుతుంది. రాష్ట్రంలో టిబి రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న హెచ్ఐవి బాధితులు, చిన్నారుల్లోనే కాదు. టీనేజ్ అమ్మాయిలలోనూ ఇది వెలుగు చూస్తుంది. జన సమూహం ఎక్కువగా ఉన్న హాస్టల్లో ఉండడం, సరైన వ్యాయామం లేకపోవడం, పోటీ పరీక్షల పేరుతో పెరుగుతున్న ఒత్తిడికి తోడు ఆశించిన స్థాయిలో పౌష్టికాహారం అందకపోవడంతో రోక నిరోధక శక్తి తగ్గుతుంది. మరి కొంతమంది ఉదయం పూట ఏమీ తినకుండానే ఖాళీ కడుపుతో కాలేజీకి బయలుదేరి, మధ్యాహ్నం క్యాంటీన్లో రెడీమేడ్ ఫుడ్ తో కడుపు నింపుకోవడం వెరసి పౌష్టికాహార లోపం ఏర్పడుతుంది. దీంతో చాలామంది టిబి బారిన పడుతున్నారు అని సిద్దిపేట ప్రభుత్వ నర్సింగ్ కళాశాల సహాయ ఆచార్యులు డాక్టర్ లిల్లీ మేరి తెలిపారు.

ఇక డైలీ గోలి…

వారానికి మూడు రోజులు కోర్సు విధానంలో టిబి వ్యాధిగ్రస్తులు గోలీలు వేసుకోవడం మరిచిపోతే ఇబ్బందులు ఎదురయ్యేవి. వ్యాధిగ్రస్తులు మాత్రలు వేసుకోవటం ఏరోజు మరిచిపోయిన కోర్సు మొత్తం మళ్ళీ ప్రారంభించాల్సి ఉండేది. దీంతో వ్యాధిగ్రస్తుల సంఖ్య తగ్గకపోగా, ఏటేటా కొత్త వారిని గుర్తిస్తుండేవారు. ఈ మేరకు లోపాలను సవరించేందుకు కొత్త విధానములో రోజు మాత్రలు వేసుకోవడంతో ఎవరూ మర్చిపోరని, తద్వారా వ్యాధిగ్రస్తుల సంఖ్య తగ్గుముఖం పడుతుందని ప్రభుత్వం భావించింది. ఈ కొత్త విధానములో వ్యాధిగ్రస్తులు త్వరగా కోలుకునే అవకాశం ఉంది. నిత్యము గోలీలు వేసుకుంటే టిబి సూక్ష్మజీవులు త్వరగా నాశనమై వ్యాధి క్రమంగా తగ్గుతుందని సిద్దిపేట ప్రభుత్వ నర్సింగ్ కళాశాల సహాయ ఆచార్యులు డాక్టర్ లిల్లీ మేరి అన్నారు.

చిన్నపిల్లలకు ప్రత్యేకం

టిబి బారిన పడిన చిన్నారులకు ప్రస్తుత విధానంలో మార్పులు చేశారు. గతంలో గోలీలు మింగేందుకు చిన్న పిల్లలు ఇబ్బందులు పడుతున్నారని ఫిర్యాదుల మేరకు సులువుగా నీటిలో కరిగిపోయే మందులను సిద్ధం చేశారు. దీంతో చిన్న పిల్లలకు గోలీలను నీటిలో కలిపి పిల్లలకు తాగిస్తే సరిపోతుంది అని సిద్దిపేట ప్రభుత్వ నర్సింగ్ కళాశాల సహాయ ఆచార్యులు డాక్టర్ లిల్లీ మేరి అన్నారు.

క్షయ వ్యాధిగ్రస్తులకు 500 రూపాయలు

క్షయ వ్యాధితో బాధపడుతున్న వారికి ఉచితంగా వైద్య పరీక్షలు, మందులతో పాటు ప్రభుత్వం 500 రూపాయలు అందజేస్తుంది. బాధితులు క్రమం తప్పకుండా మందులు వాడటంతో పాటు పౌష్టికాహారము తీసుకోవాల్సి ఉంటుంది. అందుకు బాధితులపై ఆర్థిక భారం పడకుండా ఉండేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి, ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయించుకుంటున్న వ్యాధిగ్రస్తులకు పాలు, పండ్లు, గుడ్లు వంటి అదనపు పౌష్టికాహారము తీసుకోవడానికి ఈ సహాయాన్ని అందిస్తున్నది అని సహాయ ఆచార్యులు డాక్టర్ లిల్లీ మేరి అన్నారు.

అందుబాటులో డాట్స్

టిబి వ్యాధి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నిర్లక్ష్యం చేస్తే ఒకరి నుంచి మరొకరికి సోకే అవకాశం ఉందని, టిబి వ్యాధితో బాధపడుతున్న రోగులకు ఆయా గ్రామాలలో డాట్స్ మందులు అందుబాటులో ఉన్నాయని, ప్రతినెల 5వ తేదీన టిబి రోగులకు సంబంధించి వివరాలు, వారి ఆరోగ్య పరిస్థితిలపై ప్రభుత్వం సమాచారాన్ని తీసుకొని మరింత వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని అని సిద్దిపేట ప్రభుత్వ నర్సింగ్ కళాశాల సహాయ ఆచార్యులుడాక్టర్ లిల్లీ మేరి తెలిపారు.

 

Related News

Select the Topic
Scroll to Top