ఈతరం భారతం హైదరాబాద్ జూలై 12( వినోదం)
జగపతి బాబు, లయ, హృతికా శ్రీనివాస్ ప్రధాన పాత్రల్లో నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘వదలా’. ఆకెళ్ల వంశీకృష్ణ దర్శకత్వం వహించిన ఈ కిషోర్ నాయుడు, తమ్మారెడ్డి భరద్వాజ్ నిర్మించారు. 25 ఏళ్ల తర్వాత జగపతిబాబు, లయ జంటగా నటించిన చిత్రమిది. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాని జులై 17న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా మూవీ ట్రైలర్ను లాంచ్ చేశారు. ఇద్దరు పిల్లలతో అన్యోన్యమైన దాంపత్య జీవితం కొనసాగిస్తున్న భార్యాభర్తల మధ్యలోకి ఒక యువతి ప్రవేశించిన తర్వాత వారి జీవితం ఎలా మారింది అనేది ఈ ట్రైలర్లో చూపించారు.















