ఆదిలాబాద్ ఫిబ్రవరి 23 ఈతరం భారతం:
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉట్నూరు మండలం శ్యామ్పూర్లో సోమవారం ఉదయం బ్రిడ్జి పై నుంచి ఆర్టీసీ బస్సు కింద పడింది. ఈ ఘటనలో ఐదుగురు ప్రయాణికులు గాయపడ్డారు.ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి వచ్చిన పోలీసులు, అత్యవసర సేవల సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన బస్సును ఆసిఫాబాద్ డిపోనకు చెందినదిగా గుర్తించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది
.














