ఈతరం భారతం ఆదిలాబాద్ మే 18
జిల్లా కేంద్రంలోని దేవాదాయ ధర్మాదాయ శాఖ కార్యాలయంలో సోమవారం తొలిసారిగా ధర్మవాణి నిర్వహించారు. ఉమ్మడి జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ సహాయ కమిషనర్ సుగూరి నవీన్ కుమార్ అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్చకులు, దేవాలయ సిబ్బంది తమ సమస్యలను ఈ ధర్మవాణిలో విన్నవించుకొని పరిష్కరించుకోవాలని సూచించారు. ప్రతి సోమవారం ఈ ధర్మవాణి ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు కొనసాగుతుందని చెప్పారు.














