ఈతరం భారతం హైదరాబాద్ జూలై 30
గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ను రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ గురువారం లోక్ భవన్లో మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా సికింద్రాబాద్లో నిర్వహించనున్న ఆషాఢ బోనాల (లష్కర్ బోనాలు) ఉత్సవాలకు హాజరుకావాలని గవర్నర్ గారిని ఆహ్వానించారు. ఉజ్జయిని మహంకాళి దేవస్థాన ప్రధాన అర్చకులు ఈ సందర్భంగా ఆహ్వాన పత్రికను గవర్నర్ గారికి చదివి వినిపించారు. దేవాదాయ శాఖ డైరెక్టర్ హనుమంతరావు, ఉజ్జయిని మహంకాళి దేవస్థానం ఈవో, అసిస్టెంట్ కమిషనర్ మనోహర్ రెడ్డి తదితరులు ఈ సందర్భంగా మంత్రి వెంట ఉన్నారు.















