ఈతరం భారతం హైదరాబాద్ జులై 14
తెలంగాణలో టెట్ పరీక్షలో 14,814 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు ఫెయిల్… !కేవలం 37.29 శాతం ప్రభుత్వ ఉపాధ్యాయులు మాత్రమే పాస్.గత నెలలో నిర్వహించిన టెట్ పరీక్షలో మొత్తం 23,623 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు హాజరుకాగా, పరీక్షలో కేవలం 8,809 మంది ఉపాధ్యాయులు పాస్ కాగా, 14,814 మంది ఉత్తీర్ణత సాధించలేకపోయారు.గత ఏడాది 50 శాతం ఉత్తీర్ణత నమోదుకాగా, ఈసారి కేవలం 37.29 శాతం ఉత్తీర్ణత నమోదైంది. కాగా, ప్రభుత్వ ఉపాధ్యాయులు 2028 ఆగస్టు నెలలోపు టెట్ పాస్ కాకపోతే ఉద్యోగం కోల్పోవాల్సి వస్తుందని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది.















