ఈతరం భారతం ములుగు ఏప్రిల్ 26
శ్రీ కంఠమహేశ్వర, సురమాంబదేవి, వనం ఎల్లమ్మ, వనం మైసమ్మ గౌడ కులదేవతల విగ్రహ స్థిర ప్రతిష్ఠ, కళ్యాణ మహోత్సవం ఐదు రోజులపాటు అపూర్వమైన ఆధ్యాత్మిక వైభవంతో ఘనంగా నిర్వహించబడింది. ఈ నెల 22వ తేదీ నుంచి 26వ తేదీ వరకు సాగిన ఈ మహోత్సవం భక్తిజనాలతో కళకళలాడుతూ గ్రామాన్ని పుణ్యక్షేత్రాన్ని తలపించేలా మార్చింది.మహోత్సవంలో తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.














