ఈతరం భారతం ములుగు జనవరి 21
తెలంగాణ : మేడారం జాతర నుంచి భక్తులు ఇళ్లకు చేరేందుకు నిమిషానికి 4 బస్సులు నడిపేలా ఏర్పాట్లు చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. జాతరకు ఆర్టీసీ బస్సుల్లో 20 లక్షల మంది ప్రయాణిస్తారని అంచనా వేస్తున్నారు. రద్దీకి తగ్గట్లుగా 4వేల ప్రత్యేక బస్సులు నడపనున్నారు. 50 ఎకరాల్లో ఒకేసారి 1000 బస్సులు నిలిపేలా ఏర్పాట్లు చేశారు. మేడారం నుంచి వచ్చేటప్పుడు బస్సులు ఖాళీగా ఉంటాయి కాబట్టే 50% అదనపు ఛార్జీలు వసూలు చేయనున్నామని మంత్రి స్పష్టం చేశారు.














