ఈతరం భారతం నల్లగొండ జూన్ 25 ;
ఈనెల 28న నల్లగొండకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రానున్నారు. హైదరాబాద్ నుండి హెలికాప్టర్ లో బయలుదేరి నల్లగొండ జిల్లా కనగల్ మండలం చేరుకొని…మొదటగా…మధ్యాహ్నం 3:30 గంటల ప్రాంతంలో…కనగల్ మండలం AMC మార్కెట్ యార్డు వద్ద నిర్మించిన “హ్యామ్” రోడ్ల పైలాన్ ను ఆవిష్కరించనున్నారు. అనంతరం…నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ లో మొదటి ఫేజ్ డ్రింకింగ్ వాటర్ అందించే పనులకు శంకుస్థాపన చేయనున్న సిఎం.ఎన్జీ కాలేజి గ్రౌండ్స్ లో జరిగే భారీ బహిరంగ సభకు హాజరుకానున్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగం…అనంతరం SHG మహిళా సంఘాలకు చెక్కులు అందజేయను న్నారు.















