ఈతరం భారతం సిద్దిపేట , మే 10 :
ప్రముఖ సంఘ సేవకులు, సీనియర్ నాయకులు దరిపెల్లి చంద్రం ఈనెల 12న ( మంగళవారం) ఉదయం 10 గంటలకు సిద్దిపేట జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేసి పదవీ బాధ్యతలు చేపట్టనున్నారని సామాజిక కార్యకర్త దునుకు వేలాద్రి ఆదివారం తెలిపారు. ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి విద్యావంతులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు, పాఠకులు హాజరుకావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులుగా ఎంపికైన చంద్రం కు వేలాద్రి శుభాకాంక్షలు తెలిపారు.














