ఈతరం భారతం యాదాద్రి భువనగిరి : ఆగస్ట్ 28
జిల్లా పరిధిలోని ఆలేరు నియోజకవర్గ కేంద్రంతో పాటు మండలంలోని వివిధ గ్రామాలలో శుక్రవారం రాఖీ పండుగ వేడుకలు ఆనందోత్సాహాల మధ్య అత్యంత ఘనంగా జరిగాయి. చిన్నారులు, యువతులు, మహిళలు తమ సోదరులకు బంధుమిత్రులకు రాఖీలు కట్టి స్వీట్లు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. రాఖీ పండుగను పురస్కరించుకొని దేవాలయాలలో జరిగిన ప్రత్యేక పూజలు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. పలుచోట్ల వివిధ సంఘాలు, సంస్థల ఆధ్వర్యంలో రాఖీ వేడుకలను సామూహికంగా నిర్వహించి స్వీట్లు పంపిణీ చేశారు.















