ఈతరం భారతం యాదాద్రి భువనగిరి జిల్లా ఆగస్ట్ 15
జిల్లా పరిధిలోని ఆలేరు నియోజకవర్గ కేంద్రానికి చెందిన జేఎంజె, శ్రీ రామకృష్ణ విద్యాలయం లలో శనివారం నిర్వహించిన 80వ భారత స్వాతంత్ర దినోత్సవ విద్యార్థుల సాంస్కృతిక వేడుకలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. సంప్రదాయ భారతీయ వస్త్రధారణలో, జాతీయత ఉట్టిపడేలా విద్యార్థులు సాంస్కృతిక అంశాలను ప్రదర్శించారు. ఆయా విద్యా సంస్థల నిర్వాహకులు, విద్యార్థులను ప్రశంసించి బహుమతులు అందజేశారు. జూకంటి హిమశ్రీ, జూకంటి చైత్ర తో పాటు పలువురు విద్యార్థులు పాల్గొన్నారు.















