ఈతరం భారతం హైదరాబాద్ సెప్టెంబర్ 1 :తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వారి ఆరోగ్యాలకు భరోసా ఇచ్చేందుకు రేవంత్ సర్కార్.. సెప్టెంబర్ 1 (ఈరోజు) నుంచి రాగిజావ పథకం మళ్లీ ప్రారంభించనుంది. పాఠశాలకు వచ్చే ప్రతి విద్యార్థి ఆరోగ్యానికి తోడు న్యూట్రిషన్ కూడా పొందేలా ఈ పథకాన్ని సిద్ధం చేశారు. ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు పిల్లలకు వారానికి మూడు రోజులు రాగిజావ అందించనున్నారు.















