ఈతరం భారతం హైదరాబాద్ సెప్టెంబర్ 1 :21 ఏళ్ల క్రితం అదృశ్యమైన భర్త ఉద్యోగం ఇవ్వాలని క్యాన్సర్తో బాధపడుతున్న మహిళ పిటిషన్ పై హైకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. చట్ట ప్రకారం ఏడేళ్లు ఎవరైనా కనిపించకుండాపోతే చనిపోయినట్లేనని, వారసత్వం కింద కుటుంబానికి ఉద్యోగం ఇవ్వాలని ఇండియన్ బ్యాంకుకు సూచించింది. వారికి రావాల్సిన పదవీ తొలగింపు ప్రయోజనాలు చెల్లించాలని ఖమ్మంకు చెందిన వనపట్ల సుగుణ పిటిషన్ పై జస్టిస్ నగేశ్ భీమపాక ఈ ఆదేశాలు ఇచ్చారు.















