ఈ తరంభారతం జగిత్యాల సెప్టెంబర్ 6 :జగిత్యాల జిల్లా పోలీస్శాఖ ఆధ్వర్యంలో గణేశ్ నిమజ్జనోత్సవం బందోబస్తులో ట్రాన్స్జెండర్లచే ట్రాఫిక్ నియంత్రణ చేపట్టడం జరిగింది. హైదరాబాద్ తర్వాత రాష్ట్రంలో ఇలాంటి ముఖ్యమైన ప్రజా సేవా కార్యక్రమ బాధ్యతల్లో ట్రాన్స్జెండర్లను చేర్చిన రెండవ జిల్లా జగిత్యాలగా నిలిచిందని ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు., చింతకుంట వద్ద గణేశ్ నిమజ్జన బందోబస్తులో ట్రాన్స్జెండర్లను భాగస్వామ్యం చేయడం వల్ల సమాజంలో ప్రతి వర్గానికీ గౌరవం, మర్యాద, సమానత్వం అందించే మంచి సందేశం వెళ్తుంది అని ఎస్పీ అశోక్ కుమార్ పేర్కొన్నారు. తమదైన జీవనశైలిలో ఉండే వీరికి సమాజంలో వివక్షను పోగొట్టడానికి ట్రాఫిక్ వీధుల్లోకి తీసుకోవడం జరిగింది అని అన్నారు. ట్రాఫిక్ నియంత్రణలో 11 మంది ట్రాంజెండర్లు ట్రాఫిక్ విదులు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. హైదరాబాద్ తర్వాత రాష్ట్రంలో ఇలాంటి బాధ్యతల్లో ట్రాన్స్జెండర్లను చేర్చిన రెండవ జిల్లా జగిత్యాలగా నిలిచిందని ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు.















