హైదరాబాద్ సెప్టెంబర్ 16 (ఈతరం భారతం);గాంధీ జ్ఞాన్ ప్రతిష్ఠాన్ స్వర్ణోత్సవ కమిటీ తరపున, 2025-2026 సంవత్సరానికి లక్ష గాంధీ విగ్రహాల తయారీ, ప్రదర్శన మరియు పంపిణీ మరియు వివిధ సంస్థలతో నిధుల సేకరణకు మద్దతు తీసుకోవడం కోసం ప్రాజెక్ట్ కన్వీనర్ గా నల్ల కుంటకు చెందిన పురం వెంకటేశం గుప్తాను నియమించారు.ఈ మేరకు గాంధీ జ్ఞాన్ ప్రతిష్ఠాన్ ఛైర్మన్ డాక్టర్ గున్న రాజేందర్ రెడ్డి నియామక ఉత్తర్వులు జారి చేసారు.ee సందర్బంగా ఆయన మాట్లాడుతూ స్వర్ణోత్సవ వేడుకల విజయంలో కీలక పాత్ర పోశించాలని, విధులను మరియు బాధ్యతలను గాంధీ విలువలకు నిజాయితీ అంకితభావం మరియు నిబద్ధతతో నిర్వర్తిస్తారన్న ఆశా బావాన్ని వ్యక్తం చేసారు.















