నిమిషాంబిక దేవి ఆలయములో అన్నప్రసాదం పంపిణి
హైదరాబాద్ (మేడ్చల్ )సెప్టెంబర్ 29 (ఈతరం భారతం);దుర్గామాత నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బోడుప్పల్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని నిమిషాంబిక దేవి ఆలయములో మాజీ జెడ్.పి.టి.సి, బోడుప్పల్ బి.ఆర్.ఎస్.పార్టీ అధ్యక్షులు మంద సంజీవ్ రెడ్డి నిర్వహించిన అన్నప్రసాద కార్యక్రమములో మాజీ మంత్రి వర్యులు మేడ్చల్ ఎం.ఎల్.ఏ చామకూర మల్లారెడ్డి బోడుప్పల్ మాజీ మేయర్ సామల బుచ్చిరెడ్డి , మాజీ డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మి రవిగౌడ్ , బోడుప్పల్ బి.ఆర్.ఎస్. పార్టీ ప్రధాన కార్యదర్శి మీసాల కృష్ణ మొదలగు వారితో బోడుప్పల్ 15వ డివిజన్ బి.ఆర్.ఎస్. పార్టీ సీనియర్ నాయకులు సిగురు రవికుమార్,సూరజ్ నగర్ సీనియర్ నాయకులు వి.సోమ నర్సింహ చారి.తదితరులు పాల్గొన్నారు.తదనంతరం బోడుప్పల్ 15వ డివిజన్ టెలిఫోన్ కాలనీ, సూరజ్ నగర్ కాలనీ,లక్ష్మ రెడ్డి కాలనీలలో దుర్గామాత మండపాల వద్ద అన్నదానం నిర్వహించారు.















