ఈతరం భారతం/ హైదరాబాద్/ అక్టోబర్ 19 :
బీసీ బంద్, బ్యాంకులు బంద్ లతో మద్యం షాపుకు దరఖాస్తులు వేసే ఉత్సాహకులు రాలేకపోయామని, వారు చేస్తున్న విజ్ఞప్తి మేరకు దరఖాస్తులు స్వీకరించడానికి గడువు పెంచుతున్నట్లు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ పేర్కొన్నారు.ఈనెల 23న కలెక్టర్ల సమక్షంలో జరగాల్సిన మద్యం షాపుల డ్రా ను వాయిదా వేస్తున్నట్లు ఎక్సైజ్ కమిషనర్ సి. హరికిరణ్ తెలిపారు.ఈనెల 23 వరకు మద్యం షాపులకు దరఖాస్తులను స్వీకరించనున్నామని పేర్కొన్నారు.ఈనెల 27వ తేదీన కలెక్టర్ల సమక్షంలో మద్యం షాపులకు డ్రాలు తీయనున్నట్లు పేర్కొన్నారు.















