ఈతరం భారతం అమరావతి : సెప్టెంబర్ 15 మంగళవారం
_____________________________________________
ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రభుత్వ సేవలు, పథకాలు పొందడానికి ఆధార్ తప్పనిసరి కాదని, ఇది కేవలం స్వచ్ఛందమని ఉత్తర్వులు జారీ చేసింది. ఆధార్ ఇవ్వకపోయినా 246 సేవలను నిరాకరించరాదని, ఈ-కేవైసీ కోసం ఆధార్ తీసుకునే కారణాలు,వివరాల భద్రతపై స్పష్టత ఇవ్వాలని ఆదేశించింది.దివ్యాంగుల సర్టిఫికేట్ల జారీలోనూ ఇదే విధానం వర్తిస్తుందని, ఆధార్ లేదని సేవలు నిరాకరిస్తే చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పింది.















