ఈతరం భారతం/సంగా రెడ్డి/ అక్టోబర్ 23 :
హై స్కూల్, జూనియర్ కళాశాల లోపెండింగ్ పనుల కోసం మొత్తం 1 కోటి 30 లక్షల రూపాయల కోసం కలెక్టర్ కు నిర్మల, జగ్గారెడ్డివినతి పత్రం సమర్పించారు.ప్రభుత్వ బాయ్స్ హై స్కూల్, జూనియర్ కాలేజీ సంబంధించి పెండింగ్ పనులను పరిశీలించి నిర్మల, జగ్గారెడ్డి లు సమీక్ష చేసారు. హై స్కూల్ , కళాశాల మధ్య కాంపౌండ్ వాల్ నిర్మాణానికి 50 లక్షలు…కలశాల లో అదనపు తరగతి గదుల నిర్మాణం కోసం 50 లక్షలు.. హై స్కూల్, కలశాల గ్రౌండ్ లో గ్రావెల్ కోసం 20 లక్షలు… హై స్కూల్ లో కొత్తగా నిర్మించిన బిల్డింగ్ పెయింటింగ్ కోసం 10 లక్షలు.. మంజూరు చియాలని కోరారు…. ఆరు నెలల కిందట బాయ్స్ హై స్కూల్, జూనియర్ కళాశాల ను వేరు చేస్తూ ప్రహారీ గోడ నిర్మించాలనే ప్రతిపాదన వచ్చింది…. ఎందుకు ఇప్పటివరకు పూర్తి కాలేదు…. బడ్జెట్ లేకపోవడం తో పనులు జరగలేదు అని సమాధానమిచ్చి న అధికారులు… ప్రహారీ గోడ, గేట్ నిర్మాణం , ఇతర పనుల కోసం 50 లక్ష లు ఖర్చు అవుతుందని తెలిపిన అధికారులు… 50 లక్షల నిధుల కోసం కలెక్టర్ కు టీజీఐఐసి చైర్ పర్సన్ లెటర్ హెడ్ పై వినతి పత్రం ఇవ్వాలని సూచించారు.జూనియర్ కళాశాల లో సెకండ్ ఫ్లోర్ లో అదనపు తరగతి గదుల ఏర్పాటు, సేఫ్టీ వాల్ లు, సేఫ్టీ గ్రిల్స్ ఏర్పాటు చేయాలని జగ్గారెడ్డి నీ కోరిన ప్రిన్సిపాల్…. అదనపు తరగతి గదులు, సేఫ్టీ వాల్, గ్రిల్స్ కోసం మరో 50 లక్షల నిధుల కు కలెక్టర్ కు లేఖ ఇవ్వాలని సూచించిన జగ్గారెడ్డి…. జూనియర్ కళాశాల లో నిరుపయోగంగా శిథిలావస్థ లో ఉన్న భవనాలను కూల్చి వేసేందుకు కలెక్టర్ కు సమాచారం అందించాలని అన్నారు. కూల్చివేత లకు సంబంధించి ప్రొసీజర్ త్వరగా పూర్తి చేసి కూల్చివేత పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించిన జగ్గారెడ్డి…జూనియర్ కళాశాల, హై స్కూల్ గ్రౌండ్ , ప్లే గ్రౌండ్ లో వర్షం పడితే నీళ్ళు నిలుస్తున్నాయని జగ్గారెడ్డి దృష్టికి తీసుకువచ్చిన విద్యార్థులు, ఉపాధ్యాయులు…. గ్రావెల్ కోసం 20 లక్షల రూపాయ లు ఖర్చు అవుతుందని, అందుకోసం కలెక్టర్ కు వినతి పత్రం అందించా లని సూచించారు. బాయ్స్ హై స్కూల్ లో మన ఊరు మన బడి కింద నిర్మించిన రెండు అంతస్తుల బిల్డింగ్ కు కలర్ లు వేయాలని జగ్గారెడ్డి కి తెలిపిన ఉపాధ్యాయులు…. పెయింటింగ్ కోసం 10 లక్షల రూపాయల నిధుల కోసం లేఖ ఇవ్వాలని సూచించారు.















