ఈతరం భారతం/యాదాద్రి భువనగిరి/ అక్టోబర్ 26 :
జిల్లా కేంద్రం భువనగిరి పట్టణంలోని GMR BANQUET HALL లో జిల్లా GOPA సర్వ సభ్య సమావేశo జరిగింది. Gopa జిల్లా అధ్యక్షులు గా దంతూరి కుమార స్వామి గౌడ్, ప్రధాన కార్యదర్శి గా బొమ్మకంటి బాల రాజ్ గౌడ్ కోశాధికారి గా నల్లమాస ప్రవీణ్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు.గోప యాదాద్రి జిల్లా ఉపాధ్యక్షులు తిరుమల కృష్ణ గౌడ్ , నారగోని కృష్ణయ్య గౌడ్, కాటేపల్లి ఉపేందర్ గౌడ్, చెక్కిళ్ల శ్రవణ్ కుమార్ గౌడ్, ఉయ్యాల బిక్షమయ్య గౌడ్, ఆర్గనైజేషన్ సెక్రటరీ ఆగయ్య గౌడ్, నల్లమాస కుమార్ గౌడ్, బత్తిని శ్రీధర్ గౌడ్, దూడల వెంకటేష్ గౌడ్, నర్సింగ్ యమునా గౌడ్, కమిటీ ఈసీ మెంబర్స్ యమగాన్ని బుగ్గయ్య గౌడ్ రాయగిరి చంద్రయ్య గౌడ్, అనంతల వెంకన్న గౌడ్, ఎరకల నరేష్ గౌడ్, పాండాల మహేష్ గౌడ్ , ఈ కార్యక్రమంలో యాదాద్రి జిల్లా గౌడ సంఘం నాయకులు, నల్లమాస మనోజ్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు
ఈ సమావేశానికి రాష్ట్ర GOPA అధ్యక్షులు బండి సాయన్న గౌడ్ ముఖ్య అతిథిగా హాజరైనారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గౌడ్ ఆఫీసియల్స్ & ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ఆవిర్భవించి యాభై సంవత్సరాలు పూర్తి చేసుకుని స్వర్ణోత్సవ సంబరాలకు సిద్ధం అవుతుంది అన్నారు. ఈ సందర్భంగా గౌడ్ ల విద్య ఆర్థిక సామాజిక రాజకీయ పరిస్థితులపై మాట్లాడుతూ అన్ని రంగాల్లో గౌడ్ కుల వెనకబాటును సభ్యులకి గుర్తు చేసారు. ఈ వెనుకబాటు తనం ను అధిగమించాలి అంటే చదువే పరిష్కారం చూపుతుంది అన్నారు. అందరూ నాణ్యమైన విద్య ను అందుకున్నప్పుడే ఆర్థికంగా సామాజికంగా రాజకీయo గా బలపడుతారని వివరించారు.
చదువు మాత్రమే ధైర్యాన్ని ఆత్మ విశ్వాన్ని ఆర్ధికాభివృద్ధి ను పాలసీ ల నిర్మాణం లో భాగస్వామ్యాన్ని రాజకీయ భాగస్వామ్యాన్ని అందిస్తుంది అన్నారు అందుకే ప్రతి మనిషి చదువుకుని అన్ని అవకాశాలు అందిపుచ్చుకోవాలని కోరారు. ఈ కార్యక్రమానికి దంతూరి కుమార స్వామి గౌడ్ గారు సభాఅధ్యక్షత వహించారు.
ఈ కార్యక్రమంలో గోప కమిటీ రాష్ట్ర ఉపాధ్యక్షులు చెక్కిళ్ళ మధు సుధన్ గౌడ్ మాట్లాడుతూ గౌడ్ లు అంతా ఐక్యం కావలసిన సందర్భాన్ని తెలిపారు. మరో ఉపాధ్యక్షులు ముద్దగౌని రామ్ మోహన్ గౌడ్ మాట్లాడుతూ గౌడ్ ల రాజకీయ ప్రస్థానాన్ని గుర్తు చేశారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు గోపగాని ఆనంద్ గౌడ్ మాట్లాడుతూ ఉన్నత విద్యా అవకాశాలను అందుకునే మార్గాలను సూచించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ తరఫున గుడిపురి సాయి వేణు గౌడ్, సైదులు గౌడ్, హైదరాబాద్ గోపా బాధ్యులు పొట్లపల్లి అశోక్ గౌడ్ నల్గొండ జిల్లా GOPA అధ్యక్షులు దంతూరి సైదులు గౌడ్ నకరికంటి శ్రీనివాస్ గౌడ్ సిద్దగౌరీ పరమేశ్వర్ గౌడ్ తదితరులు పాల్గొని ప్రసంగించారు.















