ఈతరంభారతం/ హైదరాబాద్/ అక్టోబర్ 28 :
ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఆలోచన మేరకు ప్రజలకు పోషకాహారం అందించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు పౌష్టికాహారం అందించేందుకు ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం 21వేల కోట్ల రూపాయల నిధులు వెచ్చించిదన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఈ రోజు నిర్వహించిన పోషణ మాసోత్సవ ముగింపు వేడుకల్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పాల్గొన్నారు.















