ఈ తరం భారతం/ హైదరాబాద్/ అక్టోబర్ 30 :
రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ హుస్నాబాద్ లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణలో ధాన్యం సేకరణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఫీల్డ్ లో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. తుఫాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లు ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, ఉత్తంకుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖ, వాకిటి శ్రీహరి, ముఖ్యమంత్రి సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి, సెక్రటరీ వేముల శ్రీనివాసులు, డిజిపి శివధర్ రెడ్డి, ఎచ్ ఎం డబ్లూ ఎస్ ఎస్బిఐ ఎం డి అశోక్ రెడ్డి, తుఫాన్ ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, దాదా అధికారులు హాజరయ్యారు.















