ఈతరంభారతం అమరావతి జూన్ 11
విద్యార్థుల్లో నైతిక విలువలను పెంపొందించేందుకు ప్రముఖ ప్రవచనకర్త, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైతిక విలువల సలహాదారుగా ఉన్న చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాలను బోధించేందుకు.. వాటిని స్కూల్ సిలబస్లో విద్యా శాఖ చేర్చింది.ఏపీలోని స్కూళ్లలో చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాలను పాఠ్యాంశాలుగా చేర్చుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆరు నుంచి పదో తరగతి విద్యార్థులకు గతేడాది ప్రవేశపెట్టగా.. 1 నుంచి ఐదో తరగతి విద్యార్థులకు ఈ ఏడాది నుంచి బోధించనున్నారు. కేవలం బోధనలు మాత్రమే కాకుండా.. వాటిపై పరీక్షలు నిర్వహించి.. మార్కులు కూడా వేయనున్నారు. ఇక శనివారం నో బ్యాగ్ డే సందర్భంగా చాగంటి ప్రవచనాలు చెప్పనున్నారు.















