ఈతరం భారతం హైదరాబాద్ సెప్టెంబర్ 3 : హైడ్రాకు సంబంధించిన ఫిర్యాదులు స్వీకరించడానికి టోల్ఫ్రీ నంబర్ 1070 అందుబాటులోకి వచ్చినట్లు కమిషనర్ రంగనాథ్ తెలిపారు. చెరువులు, నాలాలు, పార్కులు, ప్రభుత్వ భూములు, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలు కబ్జాకు గురైతే వెంటనే టోల్ఫ్రీ ద్వారా సమాచారాన్ని అందించవచ్చన్నారు. చెట్లు పడిపోయినా, వరద ముంచెత్తినా, అగ్ని ప్రమాదాలు జరిగినా టోల్ ఫ్రీ నంబర్ కు కాల్ చేయాలన్నారు. అందుబాటులో సెల్ నంబర్లు కూడా ఉన్నాయన్నారు.















