ఈ తరం భారతం/ హైదరాబాద్ /అక్టోబర్ 30:
తెలంగాణ రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం మరింత వేగంగా పెరగబోతోంది. ప్రభుత్వం గ్రీన్ ట్రాన్స్పోర్ట్ను ప్రోత్సహించే దిశగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో, 12 నేషనల్ హైవేస్పై ఎలక్ట్రిక్ వెహికిల్ పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. పీఎం ఈ-డ్రైవ్ పథకం కింద నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా 13 రూట్లలోని ప్రాంతాలను ప్రతిపాదించగా, వాటిలో 12 మార్గాలకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది















