ఈతరం భారతం హైదరాబాద్ సెప్టెంబర్ 6 : బండ్లగూడ కీర్తి రిచ్మండ్ విల్లాస్లో గణేశ్ లడ్డూ రూ.2.32కోట్లు భారీ ధర పలికిన విషయం తెలిసిందే. 80 విల్లాల ఓనర్స్ 4 గ్రూపులుగా ఏర్పడి బిడ్ తరహా వేలంలో పాల్గొంటారు. ఆక్షన్లో వచ్చిన మొత్తాన్ని RV దియా ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా 42 NGOలకు ఆర్థికసాయం చేస్తారు. వృద్ధాశ్రమాలు, స్త్రీ సంక్షేమం, జంతు సంరక్షణకు వినియోగిస్తారు. 2018లో రూ.25 వేలతో మొదలైన ఈ లడ్డూ వేలం ఇప్పుడు రూ.2.32 కోట్లకు చేరింది.















