ఈతరంభారతం /కరీంనగర్ /అక్టోబర్ 20: జిల్లా పరిధిలోని అన్ని ప్రధాన పట్టణాలు, గ్రామాలలో సోమవారం దీపావళి పర్వదిన వేడుకలను ప్రజలు అత్యంత ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. ఉదయం నుండి ఆలయాలలో ప్రత్యేక పూజలు జరిగాయి. సాయంత్రం గృహాలు, వ్యాపార సముదాయాలలో లక్ష్మీ పూజలను నిర్వహించారు. చిన్నా పెద్ద అన్న బేధంఆనందోత్సాహాల మధ్య లేకుండా దీపావళి టపాకాయలు కాలుస్తూ వెలుగుల పండుగ వేడుకలను ఆనందోత్సాహాల మధ్య ప్రజలు జరుపుకున్నారు.















