ఈతరం భారతం ఆగస్టు 31 యాదాద్రి భువనగిరి: జిల్లా పరిధిలోని ఆలేరు నియోజకవర్గ కేంద్రం లోని పోచమ్మ వాడ దేవాలయం ప్రాంగణంలో గణపతి నవరాత్రి మహోత్సవ ఆదివారం మహా అన్నదాన ప్రసాద వితరణ జరిగింది. అంతకుముందు వేద పండితులు ఆలేటి రంగన్న ఆధ్వర్యంలో గణపతి హోమం, గణపతి పూజను నిర్వహించారు. అనంతరం జరిగిన అన్న ప్రసాద వితరణలో పెద్ద సంఖ్యలో ప్రజలు,భక్తులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆలేరు మాజీ జడ్పిటిసి బొట్ల పరమేశ్వర్, డాక్టర్ తిరునగరి శ్రీనివాస్, ప్రముఖ విద్యావేత్త బండిరాజుల శంకర్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ డైరెక్టర్ ఆడెపు బాలస్వామి, ఐ వి ఎఫ్ ధార్మిక పరిషత్ రాష్ట్ర చైర్మన్ దేవి డాక్టర్ వంగపల్లి అంజయ్య స్వామి, ప్రముఖ రచయిత, కవి బైరపాక స్వామి, సబ్బని సుభాష్, బొట్ల విశ్వేశ్వర్, బండ శ్రీనివాస్,పాశికంటి శ్రీనివాస్, దయ్యాల సిద్ధులు, శీలం వెంకటేష్, నరసింహులు, పిడిశెట్టి తిరుపతయ్య, కుడికాల భానుచందర్, కుడికాల రాకేష్, శీల కార్తీక్, సబ్బని గణవర్ధన్, పాశికంటి రోహన్,సబ్బని లక్ష్మీనారాయణ, భగత్ సింగ్ యువజన సంఘం సభ్యులు పాల్గొన్నారు.















