యాదగిరిగుట్ట, సెప్టెంబర్ 2 (ఈ తరంభారతం);:రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వానాకాలం 2025 సంవత్సరానికి గాను డిజిటల్ పంటల సర్వే గత ఆగష్టు 26 తేదీ నుండి ప్రారంభించారు ఈ సర్వే ద్వారా రైతుల భూములపై పండుతున్న పంటల వివరాలు ,భూమి వివరాలు వంటి డేటాను సేకరిస్తున్నారు.ఈ పంటల వివరాలు సాంకేతిక పద్ధతిలో నమోదు చేయడం ద్వారా రైతులకు మెరుగైన సేవలు అందించడమే ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యం .ప్రతి ఖాతాదారుడు భూమి పై నాటిన పంటలను కచ్చితంగా నమోదు చేసుకోవాలి.వ్యవసాయ శాఖ డేటా ఆధారంగా ఇతర ప్రభుత్వ పథకాలు, విధానాలు రూపొందించడం , ఆ యొక్క పథకాల అమలులో ఈ డిజిటల్ క్రాప్ సర్వే కీలక పాత్ర పోషిస్తాయి .ఇది ఒక ప్రత్యేక ఆప్ ద్వారా చేయబడుతుంది ఈ సందర్భంగా అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ శ్రీమతి శాంతి నిర్మల సోమవారం సైదాపూర్ గ్రామంలో నిర్వహింపబడిన డిజిటల్ క్రాఫ్ట్ సర్వే కార్యక్రమాన్ని పరిశీలించారు.ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి శ్రీమతి సుధారాణి, ఏఈఓ శ్రీ వీరన్ కుమార్ పాల్గొన్నారు.















