ఈతరంభారతం ఆలేరు ఆగస్టు 28 : యాదాద్రి భువనగిరి: ఆలేరు నియోజకవర్గ కేంద్రంలో లైన్మెన్ గా పనిచేస్తున్న జంగ యాదగిరి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా ప్రభుత్వ అవార్డును అందుకున్న నేపథ్యంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గురువారం ఆయనను ఫ్రెండ్లీ యూత్ ఆధ్వర్యంలో వినాయక మండపం వద్ద ఘనంగా సన్మానించారు. ఉద్యోగిగా యాదగిరి అందిస్తున్న సేవలను ఎమ్మెల్యే ప్రశంసించారు. కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఎంఏ ఎజాస్, కలకుంట్ల లోకేష్, ఫ్రెండ్లీ యూత్ ప్రతినిధులు పాల్గొన్నారు.















